Pages

Pages - Menu

15.6.12

ప్రధానిని రాష్ట్రపతి భవన్‌కు పంపించేది లేదు: కాంగ్రెస్ స్పష్టం



Manmohan
FILE
దేశ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌ను రాష్ట్రపతి భవన్‌కు పంపించే ప్రసక్తే లేదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ రాష్టప్రతి పదవికి ప్రతిపాదించిన పేర్లను కూడా కాంగ్రెస్ పార్టీ గట్టిగా తిరస్కరించింది.

ప్రధాన మంత్రిగా ఉన్న మన్మోహన్‌ను రాష్ట్రపతిగా ఎన్నుకోవాలనే ప్రతిపాదనను ఎలా అంగీకరిస్తామని కాంగ్రెస్ మీడియా విభాగం ఛైర్మన్ ద్వివేదీ ప్రశ్నించారు. మన్మోహన్ 2014 వరకు ప్రధానిగా కొనసాగుతారని స్పష్టం చేశారు. 

సంకీర్ణ ప్రభుత్వం నాయకుడిని మధ్యలో మార్చుకునే ప్రసక్తే లేదన్నారు. మిత్రపక్షాలైన టిఎంసి, ఎస్పీలు రాష్టప్రతి పదవికి ప్రతిపాదించిన మన్మోహన్, మాజీ రాష్టప్రతి ఏపిజె అబ్దుల్ కలాం, లోక్‌సభ మాజీ స్పీకర్ సోమ్‌నాథ్ చటర్జీ అభ్యర్థిత్వాలను ఖరాఖండీగా తిరస్కరించినట్లు వెల్లడించారు. 

రాష్టప్రతి పదవికి అందరూ ఆమోదించే అభ్యర్థిని ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ చర్చల ప్రక్రియ కొనసాగిస్తున్నట్టు ద్వివేది తెలిపారు.