NEWS

Blogger Widgets

16.8.12

మోడీ ప్రధాని అభ్యర్థయితే బీజేపీతో తెగదెంపులేనన్న నితీశ్!


న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోడీని బీజేపీ తమ ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే.. తాను ఎన్డీయే కూటమి నుంచి వైదొలుగుతానని బీహార్ సీఎం, జేడీయూ నేత నితీశ్ కుమార్ తమకిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పినట్లు బుధవారం ఒక మేగజైన్ వెల్లడించింది. ఎన్నికల తర్వాత అవసరమైతే కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు సిద్ధమేనని ఆయన స్పష్టంచేసినట్లు ఆ మేగజైన్ రాసింది. అయితే నితీశ్ మాత్రం తాను అలాంటి ఇంటర్వ్యూ ఏదీ ఇవ్వలేదంటూ ఆ వార్తలను ఖండించారు. అలాగే ఇంటర్వ్యూ చేసినట్లు చెబుతున్న ‘ద వీక్’ పత్రిక ఆ వార్తను ఇంటర్నెట్ వెబ్‌సైట్ నుంచి కూడా తొలగించిందని నితీశ్ అన్నారు. మరోవైపు ‘ద వీక్’ మేగజైన్ మాత్రం తాము నితీశ్‌ను ఇంటర్వ్యూ చేశామని స్పష్టంచేసింది. మోడీని గనుక ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే.. ఆ ప్రకటన వెలువడిన నిముషాల వ్యవధిలోనే తాను ఎన్‌డీఏ కూటమి నుంచి వైదొలుగుతానని, తమ డిమాండ్లు తీర్చితే ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌తో పొత్తుకు సిద్ధమేనని నితీశ్ అన్నారని వెల్లడించింది.