NEWS

Blogger Widgets

27.6.12

రామ్ చరణ్ హనీమూన్‌ అయిపోయింది!


రామ్‌ చరణ్‌ హనీమూన్‌ ముగించుకుని షూటింగ్‌కు హాజరయ్యాడు. వినాయక్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇది కాకుండా అల్లుఅర్జున్‌ కాంబినేషన్‌లో 'ఎవడు' చిత్రాన్ని చేయాలి. ఇంకా జంజీర్‌ రీమేక్‌లోనటిస్తున్నారు. 

ఎవడు షూటింగ్‌ ఈ నెల 28 నుంచి జరుగనుంది. దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. సమంత, అమీ జాక్సన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్‌ చరణ్‌ పాత్ర సస్పెన్స్‌గా ఉంచారు. ప్రత్యేకమైన పాత్ర అనీ, గెస్ట్‌రోల్‌ అని చెప్పినా.. అల్లు అర్జున్‌కు సమాన స్థాయిలో ఉంటుందని తెలుస్తోంది.