తెరాస సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సంస్మరణ సభలో కేసీఆర్ ప్రసంగిస్తూ., తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఓ జిల్లాకు జయశంకర్ పేరు పెడుతామన్నారు. జయశంకర్ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా పెడుతామన్నారు.
తెలంగాణ రాష్ట్రం త్వరలో రాబోతుందని కేసీఆర్ జోస్యం చెప్పారు. తెలంగాణ వచ్చేవరకు విశ్రమించబోమని, ఏం చేసైనా తెలంగాణ తెచ్చుకోవాలని జయశంకర్ అంటుండేవారని కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఉద్యమం ఎంత గట్టిగా ఉంటే అంత త్వరగా తెలంగాణ వస్తుందని ఆయన వెల్లడించారు.