అజిత్ కథానాయకుడుగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తమిళంలో రూపుదిద్దుకుంటున్న 'బిల్లా-2' చిత్రాన్ని 'డేవిడ్బిల్లా'గా తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న విషయం తెలిసిందే.....
ఎస్వీఆర్ మీడియా ప్రై. లి. అధినేత్రి శోభారాణి తాజాగా ఇన్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో వైడ్యాంగిల్ క్రియేషన్స్ ప్రొడక్షన్స్ పతాకంపై తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. చిత్రం ప్రపంచ వ్యాప్తంగా జూలై 13న రిలీజ్ కాబోతోంది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..'అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందిన 'డేవిడ్ బిల్లా' చిత్రాన్ని జూలై 13న ప్రపంచ వ్యాప్తంగా 1200 థియేటర్లలో తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ అవుతోంది. యువన్ శంకర్రాజా సారథ్యంలో రూపొందిన ఆడియో ఇటీవల విడుదలై సూపర్హిట్ అయింది. హై టెక్నికల్ వేల్యూస్తో భారీ బడ్జెట్తో రూపొందిన చిత్రం అజిత్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అవుతుంది'అని అన్నారు.
అజిత్కుమార్ సరసన పార్వతి ఒమనకుట్టన్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో ఓ ప్రత్యేక పాత్రను మీనాక్షి దీక్షిత్ పోషించారు. ప్రభు, బృన అబ్దుల్లా, రెహమాన్, సుదాషు పాండే, శ్రీమాన్, శ్రీచరణ్, కృష్ణకుమార్, మనోజ్ కె. జైన్ తదితరులు ఇందులోని ముఖ్యపాత్రల్ని పోషించారు.
చక్రి తోలేటి, ఎరిక్ సెల్బర్గ్లు కలిసి కథను సమకూర్చిన దీనికి శరత్ మాండవ, జాఫర్ మహ్మద్, ఇ.ఆర్. మురుగన్లు సంయుక్తంగా స్క్రీన్ప్లేని వ్రాశారు. సంగీతం: యువన్శంకర్రాజా, పాటలు: అనంత్ శ్రీరామ్, ఛాయాగ్రహణం: ఆర్.డి. రాజశేఖర్, ఎడిటింగ్: సురేష్ అర్స్, నిర్మాత: శ్రీమతి శోభారాణి, దర్శకత్వం: చక్రి తోలేటి.