-->శక్తికి ప్రతిరూపమైన కేరువామాల ఇంట్లో ఉంటే పార్వతీ, గణేశులను ఇంట్లో ప్రతిష్టించు కున్నట్టే. -->పసుపు కేరువామాల జపాన్ని ఏదైనా మంచిరోజు చూసుకుని మొదలుపెట్టడం మంచిది. అక్షయ తృతీయ రోజు అయితే మరీ ఉత్తమం.
-->కేరువామాలను చేతిలో ఉంచుకుని “ఓం గ్లౌం గణపతయే నమః” అని స్మరిస్తూ పూజిస్తే తలపెట్టిన పనిలో ఎలాంటి విఘ్నాలూ ఏర్పడవు. పసుపు కేరువామాలతో విజయం సొంతమౌతుంది.
-->కేరువామాల ఒక్కో పూసనూ తిప్పుతూ “ఓం గ్లౌం గణపతయే నమః” మంత్రాన్ని 108 సార్లు జపిస్తే గొప్ప మానసిక ప్రశాంతత లభిస్తుంది.
-->పసుపు కేరువామాలను తరచూ కడగడం వల్ల దాని మెరుగు, సొగసు తగ్గిపోతుంది. అందువల్ల జపం చేసేముందు సంకల్ప సిద్ధితో ఈ మాలపై మంత్రోదకాన్ని చిలకరిస్తే సరి. శుద్ధి చేసినట్లూ అవుతుంది, ఎప్పటికీ కొత్తగానే ఉంటుంది.
-->జపం పూర్తయిన తర్వాత కేరువా మాలను తీసి ఎక్కడో పెట్టకూడదు. పసుపు కేరువామాలను పూజా మందిరంలో, దేవుడి వద్దనే ఉంచాలి.