NEWS

Blogger Widgets

6.6.12

లగడ పాటి నుంచి ప్రాణ హాని



Jun-06-2012 06:00:48
విజయవాడ : విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌, ఆయన కుటుంబ సభ్యుల నుంచి తనకు ప్రాణ హాని ఉందని న్యాయవాది వేలూరు శ్రీనివాస్‌రెడ్డి మీడియాకు తెలిపారు. గత మాసం రోజులుగా తననకు కొందరు వెంటాడుతున్నారని ఆయన తెలిపారు. వాళ్లు తనను ఎక్కడ హత్య చేస్తారోనన్న భయం తనను పట్టుకుందని చెప్పారు.2008 మే13న లగడపాటి మనుషులు తనపై యాసిడ్‌ దాడి చేశారని ఆయన చెప్పారు. తనకు ఎటువంటి హాని జరిగినా, లగడపాటి, ఆయన కుటుంబమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇది తన మరణ వాంగ్మూలంగా తెలియజేస్తున్నాని ఆయన మీడియా వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.

Source:http://www.andhrayouth.com/telugu/view_news.php?id=24241&typ=news