NEWS

Blogger Widgets

9.6.12

చంద్రబాబు గుట్టు రట్టు చేసిన కోలా



హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు చెందిన విదేశీ బ్యాంకులలోని ఖాతాల గుట్టుని కోలా కృష్ణ మోహన్ రట్టు చేశారు. యూరో లాటరీ తనకు రాకపోయినా, ఆ లాటరీలో 83 కోట్ల రూపాయలు గెలుచుకున్నట్లు 1999లో కోలా కృష్ణమోహన్ ప్రకటించాడు. దాంతో అతనికి అనేక మంది కోట్ల రూపాయలు అప్పులు ఇచ్చారు. కొద్ది కాలానికి మోసపోయినట్లు అందరూ తెలుసుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలువురిని మోసం చేసినట్లు కోలాపై కేసులు ఉన్నాయి. ఈరోజు ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబుకు, అతని కుటుంబ సభ్యులకు విదేశాలలోని బ్యాంకు ఖాతాలలో వేల కోట్ల రూపాయలు ఉన్నట్లు వివరించారు. సింగపూర్ లోని ఒక బ్యాంకులో బాబుకు 15వేల కోట్ల రూపాయల డాలర్లు ఉన్నట్లు తెలిపారు. బాబు విదేశీ ఖాతాల వివరాలను రెండు రోజులలో హైకోర్టుకు తెలుపుతానని చెప్పారు.

గతంలో తనపై రెండుసార్లు హత్యాయత్నం చేయించినట్లు చెప్పారు. ఇప్పుడు తనకు ఏమైనా జరిగితే దానికే చంద్రబాబే బాధ్యుడవుతారని ఆయన తెలిపారు. తనకు లాటరీ వచ్చినట్లు తెలిసి చంద్రబాబు తనని పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలిపారు. 1999లో చంద్రబాబుకు 5 కోట్ల పది లక్షల రూపాయలు ఇచ్చినట్లు తెలిపారు. పది లక్షల రూపాయలు చెక్ రూపంలో ఇచ్చానని చెప్పారు. ఆ చెక్ ని నగదు చేసుకున్నట్లు తెలిపారు. కోటి రూపాయలు నగదు రూపంలో ఆయనకు ఇంట్లోనే ఇచ్చినట్లు చెప్పారు. మిగిలిన నాలుగు కోట్ల రూపాయలను లండన్ లోని మిడ్ లాండ్స్ బ్యాంక్ ఖాతా నుంచి సింగపూర్ బ్యాంకులోని చంద్రబాబు నాయుడు ఖాతాలోకి మార్చినట్లు తెలిపారు. లండన్ లోని తన ఖాతా నెంబరు 433846958001గా తెలిపారు. లండన్ లో తన ఖాతా గురించి పోలీసులకు తెలుసని, వారు లండన్ వెళ్లి వచ్చారని వివరించారు. సింగపూర్ లోని డ్యూషే బ్యాంకులో సి.నాయుడు. నారా అనే పేరుపై 0204049121100 నెంబరుతో ఖాతా ఉన్నట్లు వివరించాడు. తాను 5 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు పోలీసులకు కూడా తెలుసని చెప్పారు. అయితే వారు కోటి పది లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చినట్లు చెప్పమన్నారని తెలిపారు.

సింగపూర్ బార్ లేస్ బ్యాంకులో చంద్రబాబుకు మరో ఖాతా ఉన్నట్లు తెలిపారు. లండన్ లోని నార్త్ వెస్ట్ బ్యాంకులో కూడా ఖాతా ఉన్నట్లు చెప్పారు. స్విట్జర్లాండ్ లోని క్రెడిట్ నూయిస్ బ్యాంక్ లో కూడా చంద్రబాబుకు ఖాతా ఉన్నట్లు తెలిపారు. 2003 మార్చిలో కొన్ని ఖాతాలను మూసివేశారని, ఇంకా అనేక ఖాతాలలో వేల కోట్ల రూపాయలు ఉన్నట్లు చెప్పారు.

1999లో లాటరీ వచ్చిందని తెలియడంతో చంద్రబాబు తనని పార్టీలోకి ఆహ్వానించినట్లు చెప్పారు. అతని వల్లే తాను అనేక కేసులలో ఇరుక్కున్నట్లు ఆయన తెలిపారు. 2003లో తనపై చంద్రబాబు మూడుసార్లు హత్యాయత్నం చేయించారని తెలిపారు.

చంద్రబాబు కుమారుడు లోకేష్ తన వద్ద 25 లక్షల రూపాయలు తీసుకున్నట్లు తెలిపాడు. ఆ డబ్బుతో ఇంట్లో కూడా మరో 35 లక్షల రూపాయలు తీసుకొని లోకేష్ ఒక అమ్మాయి(ఉపాధ్యాయురాలు)ని తీసుకొని ఎటో వెళ్లిపోయినట్లు చెప్పాడు.

చంద్రబాబు ఎవరినైనా మేనేజ్ చేయగలన్నారు. తన కేసులో ఇడిని కూడా మేనేజ్ చేశారని చెప్పారు. ఇడి పెద్దలకు 50 లక్షల రూపాయలు ఇచ్చి మేనేజ్ చేశారని తెలిపారు. ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులకు అన్ని విషయాలు తెలుసని ఆయన చెప్పారు. చంద్రబాబు వల్లే తాను అనేక కేసులలో ఇరుక్కున్నట్లు తెలిపారు.
చంద్రబాబు కుటుంబ సభ్యుల విదేశీ ఖాతాల వివరాలను త్వరలోనే బయట పెడతానని చెప్పారు. రెండు రోజుల్లో హైకోర్టుకు సమర్పించనున్నట్లు ఆయన తెలిపారు.

చిట్యాల పోలీస్ స్టేషన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తాను చనిపోయినట్లు భావించి పోలీసులు వదిలి వెళ్లిపోయారని చెప్పారు. అదృష్టవశాత్తు బతికి బయటపడి మీ ముందుకు వచ్చినట్లు తెలిపారు.