NEWS

Blogger Widgets

9.6.12

బలహీనపడిన అల్పపీడన ద్రోణి



విశాఖపట్నం: ఒడిశా, కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి బలహీనపడింది. ఛత్తీస్ గఢ్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్లు వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. రాగల 24గంటల్లో కోస్తాంధ్రలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వారు చెప్పారు. మరో 2,3రోజుల్లో రాయలసీమలోకి రుతుపవనాలు ప్రవేశించనున్నాయని తెలిపారు.