NEWS

Blogger Widgets

11.6.12

టెన్షన్ లో చిరు మేనల్లుడు




చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ హీరోగా వైవియిస్ చౌదరి ఆల్రెడీ రేయ్ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ చిత్రం మొదలయ్యి చాలా కాలం అయినా అతీ గతీ లేనట్లుగా అయ్యింది. నిప్పు సినిమాతో చేతులు కాల్చుకున్న వైవియస్ చౌదరి అతి కష్టం మీద ఆ ప్రాజెక్టుని పూర్తి చేస్తున్నాడు. ప్రస్తుతం అమెరికా షెడ్యూల్ జరుగుతున్నట్లు సమాచారం. అయితే ఎప్పుడు ఈ చిత్రం పూర్తై రిలీజ్ అవుతుందనే విషయంలో స్పష్టత లేదు. మరో ప్రక్క చిత్రం బాగా లేటవటంతో ట్రేడ్ లో ఆసక్తి కూడా తగ్గిపోయింది. వైవియస్ చౌదరికి సైతం మార్కెట్లో ఇప్పుడు అస్సలు క్రేజ్ లేదు. దాంతో ధరమ్ తేజ లో టెన్షన్ స్టార్టైందని వినికిడి. వేరే ప్రాజెక్టులు ఓకే చేయాలని ఆలోచిస్తున్నాడని చెప్తున్నారు.