NEWS

Blogger Widgets

15.6.12

ఉప ఫలితాలు : పరకాల స్థానంలో హోరాహోరీగా పోరు!



రాష్ట్రంలో వెల్లడవుతున్న ఉప ఎన్నికల్లో భాగంగా పరకాల స్థానంలో పోరు హోరాహోరీగా సాగుతోంది. ఈ స్థానంలో తెలంగాణ రాష్ట్ర సమితి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ రసవత్తరంగా సాగుతోంది. 12 రౌండ్ల ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి సుమారు ఆరు వేల ఓట్ల మెజార్టీలో ఉన్న టీఆర్ఎస్ అభ్యర్థి.. 15వ రౌండ్ ముగిసే సమాయనికి ఆ మెజార్టీ కేవలం 668 ఓట్లకు చేరుకుంది. 


మరో ఐదు రౌండ్ల ఓట్ల లెక్కింపు సాగించాల్సి ఉంది. ఈ రౌండ్లలో స్థానికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండా సురేఖకు గట్టి పట్టుంది. ఇది మంచి ప్రభావం చూపడంతో టీఆర్ఎస్ మెజార్టీ గణనీయంగా తగ్గిపోయింది. మొత్తం మీద పరకాల ఉప పోరు.. క్షణం క్షణం ఉత్కంఠభరితంగా మారిపోతోంది.