NEWS

Blogger Widgets

8.6.12

మీడియా ప్రతినిధులపై నిత్యానంద స్వామి అనుచరుల దాడి!


nityananda swamy




సినీ నటి రంజితతో లైంగిక సంబంధం ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద స్వామి తన అనుచరులతో కలిసి మీడియా ప్రతినిధులపై తన ప్రతాపం చూపించారు. మీడియా సమావేశం పేరుతో తన ఆశ్రమానికి మరీ పిలిపించి.. రాళ్లు, కర్రలు, చీపుర్లు, చెప్పులతో కొట్టి ఆశ్రమం నుంచి గెంటేశారు. 


ఈ చర్యపై మీడియా ప్రతినిధులు ఆగ్రహంతో మండిపడుతూ, నిత్యానంద, ఆయన అనుచరులపై చర్య తీసుకోవాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ సంఘటన గురువారం బెంగుళూరులోని బిడది ఆశ్రమలో జరిగింది. మీడియా సమావేశానికి హాజరైన స్వామిని ఓ విలేకరి.. తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఓ మహిళ చేసిన ఆరోపణల గురించి ప్రశ్నించాడు.

అంతే.. ఆగ్రహంతో ఊగిపోయిన సాములోరు.. ఆ మీడియా ప్రతినిధిని బయటకు గెంటేయాలని అనుచరులకు హుకుం జారీ చేశాడు. దీంతో రెచ్చిపోయిన వీర విధేయులు.. ఆ రిపోర్టర్‌ను తోసేసి.. దుర్భాషలాడారు. చివరికి ఆయన్ను ఆశ్రమం నుంచి బయటకు గెంటేశారు. అంతటితో ఆగకుండా స్థానిక మీడియా ప్రతినిధులకు కూడా ఇదే తరహా సన్మానం చేశారు. ఈ చర్యను మీడియా ప్రతినిధులు ముక్తకంఠంతో ఖండిస్తున్నారు.