NEWS

Blogger Widgets

8.6.12

అక్కడ కేసీఆర్.. ఇక్కడ జగన్..



"నోట్ల కోసం ఆశపడొద్దు. కులం, మతం గురించి ఆలోచిస్తే మీ పిల్లల భవిష్యత్తు అంధకారమవుతుంది. అవినీతికి పాల్పడాలని ఏ మతం బోధించదు. జైలుకు వెళ్లిన వాళ్లకు ఓటేయొద్దు. తిరుపతి వేంకటేశ్వర స్వామికి రూ.40 కోట్లతో కిరీటం చేయించిన గాలి జనార్దన రెడ్డి ఆయనకు కూడా లంచం ఇచ్చే ప్రయత్నం చేశాడు. కలియుగ దైవం కాబట్టి గాలిని ఆయన శిక్షించాడు. తెలంగాణలో కేసీఆర్ నాశనం చేస్తుంటే.. ఇక్కడ జగన్ రాష్ట్రాన్ని పతనావస్థకు తీసుకెళతుతున్నాడు. రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మార్చాలని నేను శ్రమిస్తే.. కాంగ్రెస్ పాలకులు హత్యాంధ్రప్రదేశ్‌గా మార్చేస్తున్నారు.'' 
 
వైఎస్ 'ఇస్కారియోతు యూదు': మోత్కుపల్లి
రాజశేఖర్ రెడ్డి ్రకైస్తవుడని నమ్మించి దళిత ఓట్లను కొల్లగొడుతున్నారు. నిజానికి, ఆయన ఏసుక్రీస్తును నమ్మించి మోసం చేసిన 'ఇస్కారియోతు యూదు'. 
 
రాష్ట్రం హంతకుల చేతుల్లోకే..: వీహెచ్
జగన్ వంటి వ్యక్తులను ఎన్నుకుంటే రాష్ట్రం హంతకుల చేతుల్లోకి వెళ్లిపోతుంది. ఆయనకు ఓటేస్తే రాష్ట్రంలో పులివెందుల కృష్ణలు, భానుకిరణ్‌లు తయారవుతారు. వైఎస్ మృతిపై కడప ఎన్నికల్లో ఎందుకు మాట్లాడలేదు? విజయలక్ష్మి మొసలి కన్నీటిని ప్రజలు విశ్వసించడం లేదు. 
 
తండ్రి పైకి.. కొడుకు జైలుకు: రేవంత్
రాజీనామా చేసిన కొందరు ఎమ్మెల్యేలు చిల్లర కోసం గజదొంగ చుట్టూ చేరారు. గెలిచిన తర్వాత వాళ్లు మళ్లీ అమ్ముడుపోరని గ్యారెంటీ ఏమిటి? తిరుమల పవిత్రతను దెబ్బతీసే యత్నం చేసిన తండ్రి పైకిపోతే, కొడుకు జైలుకు పోయాడు. 
 
వైఎస్ కేబినెట్ అంతా జైలుకే: ముద్దుకృష్ణమ
జగన్ అక్రమాస్తుల కేసులో వైఎస్ కేబినెట్ అంతా జైలుకు వెళ్లక తప్పదు. కొందరు ఎంపీలు, సోనియాకు కూడా శిక్ష తప్పదు. కాంగ్రెస్‌లోని దొంగల ముఠాకు సోనియా చంబల్ రాణి. 
 
50% కమీషన్లలో జగన్ 100% పర్‌ఫెక్ట్: లగడపాటి
ఏ పనిలోనైనా 50 శాతం కమీషన్ తీసుకోవడంలో జగన్ 100 పర్సెంట్ పర్‌ఫెక్ట్. ఎన్నో కష్టాల్లో ఉన్నప్పుడు వైఎస్‌ను నేను ఆదుకున్నాను. పాదయాత్రలో అన్నివిధాలా సాయపడ్డాను. కానీ, ఆ కుటుంబానికి ఇప్పుడు మేమంతా చెడ్డ అయ్యాం. పెట్టుబడులు పెట్టిన వారంతా జైల్లో ఉంటే పుచ్చుకున్న వారంతా బయట ఉండడమేనా విజయలక్ష్మి నీతి!? 
 
వైఎస్ అవినీతిపై శ్వేతపత్రం: మంత్రి సి.రామచంద్రయ్య
వైఎస్ హయాంలో ఆర్థిక నేరాలన్నీ పథకం ప్రకారం జరిగాయి. అన్ని శాఖల్లో అవినీతికి పాల్పడ్డారు. వైఎస్ అవినీతి అక్రమాలపై ప్రస్తుత ముఖ్యమంత్రి శ్వేతపత్రం విడుదల చేస్తే అవినీతి బురద కాంగ్రెస్‌కు అంటుకోదు. ఈ విషయంపై సీఎం కిరణ్‌కు విజ్ఞప్తి చేస్తా. 
 
జగన్ మీడియాకు పచ్చ కామెర్లు: టీజీ వెంకటేశ్
జగన్ మీడియాకు పచ్చ కామెర్లు వచ్చాయి. అందుకే వైఎస్ఆర్‌సీపీ కార్యక్రమానికి జనం రాకపోయినా వచ్చినట్టు, ఇతర పార్టీల వారి కార్యక్రమాలకు ప్రజలు భారీగా హాజరైనా.. వెలవెలబోయినట్టు దుష్ప్రచారం చేస్తోంది. జగన్ మీడియా మూత పడే రోజులు దగ్గరకు వచ్చాయి. 
 
సుమోటోగా పాల్వాయి ప్రకటన: కడియం శ్రీహరి
జగన్ నీతిమంతుడని చెప్పుకోవడానికి ఆయన తల్లి విజయలక్ష్మి సిగ్గుపడాలి. పాల్వాయి ప్రకటనలను సీబీఐ లేదా హైకోర్టు సుమోటోగా తీసుకుని విచారణ జరపాలి. 
 
వందేళ్లైనా టీఆర్ఎస్‌తో తెలంగాణ రాదు: కిషన్ రెడ్డి
వందేళ్లయినా టీఆర్ఎస్‌తో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రాదు. ఒక బిడ్డ ఆత్మహత్య లేకుండా.. ఒక్క రక్తపు బొట్టు నేల రాలకుండా తెలంగాణ సాధించే బాధ్యత బీజేపీదే. ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే మురిగిపోతుంది. సైకిల్ పార్టీ గురించి మాట్లాడడం వృథా. కాంగ్రెస్‌ను తెలంగాణ ప్రజలు సమాధి చేస్తారు. 
 
టీడీపీని దెబ్బతీసేందుకే అరెస్టు డ్రామా: శోభారాణి
ఉప ఎన్నికల్లో తమ దెబ్బతీయడానికే సోనియా, జగన్‌ల కాంగ్రెస్‌లు అరెస్టు డ్రామా నడిపాయి. మేం లేవనెత్తుతున్న అంశాల నుంచి ప్రజల దృష్టి మళ్ళించడానికే జగన్‌ను సరిగ్గా ఉప ఎన్నికల ముందు అరెస్టు చేశారు. కొడుకు ఆర్థిక నేరాలతో రాజకీయాన్ని కలగలిపి ప్రజలపై విజయలక్ష్మి సెంటిమెంటును ప్రయోగిస్తున్నారు.